Thursday, April 18, 2024

తెలంగాణ‌కి చ‌ల్ల‌టిక‌బురు చెప్పిన.. వాతావ‌ర‌ణ‌శాఖ‌

రేప‌టి నుండి ఆరు రోజుల పాటు తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కి వాతావ‌ర‌ణశాఖ చ‌ల్ల‌టి క‌బురు చెప్పింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక కూడా జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 30–40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవొచ్చని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగాయి. శనివారం అత్యధికంగా హుజూర్ నగర్ లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement