Wednesday, April 24, 2024

భైంసాలోజాతీయ జండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

భైంసా జూన్ 2 ప్రభా న్యూస్) – ఎందరో మంది ఉద్యమకారుల త్యాగ ఫలితాలతో ఏర్పడిన స్వరాష్టం సిద్ధించడంతోనే దేశంలో ఎక్కలేని విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భైంసా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంతో మంది త్యాగ దనుల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు వారి త్యాగాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటారని పేర్కొన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేస్తేనే సంక్షేమ పథకాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రేపు నిర్మల్ లో జరిగే సీఎం బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.భైంసా డివిజన్లో దశాబ్ది ఉత్సవాలు 21 రోజులపాటు గ్రామీణ ప్రాంతo మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో సైతం కనుల పండుగగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని
ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement