Thursday, April 25, 2024

Raj Bhavan – అనుకున్నంత అభివృద్ధి జ‌ర‌గ‌లేదు … గ‌వ‌ర్న‌ర్

హైద‌రాబాద్ – నీళ్లు, నిధులు,నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్భవన్లో జ‌రిగిన‌ రాష్ట్ర అవిర్భావ వేడుకల‌లో పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్ ముందుగా జాతీయ ప‌త‌కాన్ని ఆవిష్క‌రించారు.. ఈ సంద‌ర్బంగా తెలంగాణ వీరులకు జోహార్లు తెలిపిన గవర్నర్.. పలువురు తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను స‌త్క‌రించారు..

అనంత‌రం గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం కాదని, మారుమూల పల్లెలు కూడా అభివృద్ధి చెందితేనే అసలైన అభివృద్ధి అనిపించుకుంటుందని తెలిపారు. జై తెలంగాణ అనేది ఆత్మగౌరవ నినాదమని తెలిపారు. తెలంగాణ‌కు రావ‌డం త‌న అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు.. తెలంగాణ‌లో కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలోఅనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. తన జీవితంలో ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని త‌మిళి సై అన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement