Friday, April 26, 2024

తీరు మారలేదు…తెలంగాణ కరోనా అప్డేట్!!

తెలంగాణలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ముగ్గురు కరోనాతో మృతిచెందారు. ఇక మరోవైపు గడిచిన 24 గంటల్లో 594 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,47,229కు చేరింది. అలాగే రికవరీ కేసుల సంఖ్య 6,34,612కు చేరింది.

అలాగే మొత్తం మృతిచెందిన వారి సంఖ్య 3,814కు చేరుకుంది. తాజా కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 77, కరీంనగర్‌లో 65, ఖమ్మంలో 52 నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement