Thursday, March 28, 2024

తెలంగాణలో కొత్తగా 1,897 మందికి కరోనా

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1,33,134 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి.  ఖమ్మం జిల్లాలో 163, నల్గొండ జిల్లాలో 151, రంగారెడ్డి జిల్లాలో 114, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు నమోదు అయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 95.34 శాతానికి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement