Wednesday, April 24, 2024

30 శాతం పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

తెలంగాణలో ఉద్యోగులకు శుభవార్త..ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎ కేసీఆర్ చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూన్ నెల నుంచే పెంపును వర్తింప జేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. అంటే జులై నుంచి పెరిగిన వేతనం అందుతుంది. నిజానికి మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.

కాగా, నోషనల్ బెనిఫిట్‌ను 1 జులై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక, పింఛన్ దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 9,21,037 మంది ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ది చేకూరనుంది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి., మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి., క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
పెన్షనర్లకు 1-4-2020 నుంచి 31-5-2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.
కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement