Tuesday, March 26, 2024

హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారింది…: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్..

హైదరాబాద్ తీవ్రవాదులకు అడ్డాగా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్రమంగా ఇక్కడ ఉంటున్నారని తాము చెబుతూనే ఉన్నామని ఆయన అన్నారు. బోధన్, బైంసా, నల్గొండ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ లతో ఉంటున్నారు. మత కోణంలో వారి పై చర్యలు తీసుకోవడం లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ బంగారం, మాదక ద్రవ్యాలు బయట పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ ఏం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ గా మారిపోయింది. అనేక అసాంఘిక కార్యక్రమాలకు హైదరాబాద్ కేంద్రం అయింది. తెరాస, ఏంఐఏంల రాజకీయ పొత్తు వల్లనే ఇదంతా జరుగుతుంది. పోలీసుల కు ఫ్రీడమ్ లేదని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి: మూడు రోజులు బావిలోనే గడిపిన 80 ఏళ్ల వృద్ధుడు. అయినా బతికాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement