Friday, April 19, 2024

గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన 317 జీవో ఉపసంహరణ చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 371డీ ప్రకారం నియామకాలు చేయాలనే ఆదేశాలున్నాయని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది ఉద్యోగులు-యూనియన్లకు అనుకూలంగా జీవో ఉందని, హైకోర్టు-సుప్రీంకోర్టు ఆర్డర్లను గవర్నర్‌కు చూపించారు.

కాగా, తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేత రామచంద్రరావు తెలిపారు. 317 జీవో ఉపసంహరణ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement