Friday, April 19, 2024

మంత్రి గంగులకు కరోనా!

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మంత్రి గంగుల హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా, గత కొన్నిరోజులుగా మంత్రి గంగుల హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Advertisement

తాజా వార్తలు

Advertisement