Thursday, March 28, 2024

Teen More: కేసు మీద కేసు.. తీన్మార్ మల్లన్న జైల్లోనే లాక్!

తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు మీద కేసు బుక్ అవుతోంది. ఇప్ప‌టికే జైల్లో ఉన్న ఆయ‌న‌పై నిజామాబాద్‌లో మ‌రో కంప్లెయింట్ వ‌చ్చింది. దీంతో కేసు న‌మోదు చేశారు పోలీసులు. క‌ల్లు వ్యాపారిని బెదిరించిండ‌ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై అభియోగం వ‌చ్చింది. దీంతో డబ్బుల వసూలు కేసులో మల్లన్నకు నిజామాబాద్ న్యాయస్థానం షాకిచ్చింది.

ఆయనకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్.. తనను పైస‌లు డిమాండ్ చేశార‌ని ఓ కల్లు వ్యాపారి ఇచ్చిన పిర్యాదుతో నిజామాబాద్ పోలీసులు ఈ నెల 10వ తేదీన కేసు బుక్ చేశారు. ఇందులో ఉప్పు సంతోష్‌ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు.

కేసు నమోదైన రోజే పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కాగా, ఆ టైమ్‌లో మల్లన్న చంచల్‌గూడ జైలుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో నిజామాబాద్ పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు ప‌ర్మిష‌న్‌తో మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement