Friday, March 29, 2024

రాజేంద్రనగర్ లో దారుణం.. బాలికపై యువకుడు అత్యాచారం

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మాయ మాటలతో ఆమెను ట్రాప్ చేశాడు. బైక్‌పై ఆమెను హిమాయత్ సాగర్ వైపు తీసుకెళ్లి… అక్కడి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచార విషయం బయట చెబితే చంపేస్తానని నిందితుడు బాలికను బెదిరించాడు.

అయితే, నిందితుడి బెదిరింపులతో భయపడిపోయిన బాధిత బాలిక… జరిగిన ఘటనపై తల్లికి చెప్పింది. దీంతో ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై అత్యాచార కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement