Friday, April 26, 2024

స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవగాహన సభ

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హల్ లో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షన్ -2022 అవగాహన సభ అడిషనల్ కలెక్టర్ శాంసంగ్, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, ఆర్డీఓ మల్లెయ్య, కమిషనర్ శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మేయర్ మాట్లాడుతూ… మన కార్పొరేషన్ కి స్వచ్ఛ సర్వేక్ష‌ణ్‌ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డ్ దక్కిందంటే కార్పొరేషన్ అధికారులు, కార్మిక సిబ్బంది అందరి సహకారం, శ్రమ ఎంతో ఉందన్నారు. వారంద‌రికీ సంతోషాభివందనాలు తెలుపుతూ…మున్ముందు ఇంకా మన కార్పొరేషన్ లోని ప్రతి వాడలో కూడా స్వచ్చత దిశగా ముందుకు సాగాలని, అందరూ కలిసి మరింత అభివృద్ధి పథంలో సాగుదామ‌న్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలాజీ నాయక్, ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎంసీ సిబ్బంది, సఫాయి మిత్ర కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement