Thursday, April 25, 2024

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

కందుకూరు, (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలం మక్తామాదారం గ్రామానికి చెందిన ఎరుకల ముత్యాలు ఏకే వైన్స్ ఎదురుగా ఉన్న పాత వైన్స్అండర్ గ్రౌండ్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడు.

మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముత్యాలు కొంతకాలంగా మండల కేంద్రంలోని వైన్స్ షాప్ లో పనిచేస్తూ… అక్కడే నివాసం ఉండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మృతి వెనుక అనుమానం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement