Saturday, April 20, 2024

లిఫ్ట్‌ గుంతలో పడి వైద్యుడి అనుమానాస్పద మృతి

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 లో వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంత్రుల నివాసాల ఎదురుగా హోటల్‌లో ఆరో అంతస్తు నుంచి నిర్మాణంలో ఉన్న లిప్ట్ గుంత కింద పడి వైద్యుడు మరణించారు. కూతురు పెళ్లి సంబంధం గురించి మాట్లాడటం కోసం ఇండోర్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ పవన్‌ కుమార్‌ జైన్‌ అనే వైద్యుడి కుటుంబం మూడు రోజుల క్రితం బంజారాహిల్స్‌లో హోటల్‌లో దిగింది. ఆరో అంతస్తు మీద నుంచి లిప్ట్ గుంతలో నుంచి కింద పడిన పంకజ్‌ జైన్‌.. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెంది ఉంటారని ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హోటల్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం…

తన తండ్రి పవన్‌కుమార్‌ మృతికి హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కూతురు అనుపమ జైన్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌ యాజమాన్యం ఆరవ అంతస్తులోని లిఫ్ట్‌ గుంతకు రక్షణ ఏర్పాటు చేయ కపోవడం వల్లే తన తండ్రి గుంతలో పడి దుర్మరణం చెందాడని, ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని అనుపమా జైన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement