Thursday, April 25, 2024

Suryapet : కాళేశ్వర జలాలకు లక్ష జన హారతి.. ప‌సుపు..కుంకుమ స‌మ‌ర్పించిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యపేట నియోజకవర్గం వ్యాప్తంగా కన్నులపండుగగా, కాళేశ్వర జలాలకు లక్ష జన హారతి కార్యక్రమం జ‌రిగింది. చివ్వేంల వద్ద లక్షజన హారతి కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి..అనంత‌రం గోదారమ్మకు చీర,సారె, పసుపు కుంకుమ సమర్పించారు.అనంత‌రం హారతి ఇచ్చి,ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి.
126 గ్రామాల పరిధిలో కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వల కట్టలపై చేరుకొని,హారతి ఇచ్చిన అన్నదాతలు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత తెలిపారు.కాగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి…
అన్నదాతలకు భోజనాలు, మంచి నీటి సదుపాయం కల్పించారు మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement