Wednesday, April 24, 2024

బంగారు నంది పురస్కారం అందుకున్న శ్రీనివాస్

చిట్యాల (ప్రభ న్యూస్) : ఆర్ కె కళా సాంస్కృతిక ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు నంది పురస్కారాన్ని ఆదివారం అందజేశారు. చిట్యాల మండల కేంద్రం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాస్ సే భారతి సంస్థ ద్వారా గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికిబంగారు నంది పురస్కారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. అనేకమంది బాల బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన శ్రీనివాస్ కృషిని గుర్తించి స్వర్ణ నంది పురస్కారాన్ని ఆర్కే కళా సాంస్కృతిక పౌండేషన్ వారు అందించారు.

ఈ పురస్కారాన్ని డాక్టర్ వేణుగోపాల చారి ,ఎంపీ ఆదిలాబాద్ మధుసూదనా చారి రిటైర్డ్ జడ్జి వంశీకృష్ణ ,దాసరి పద్మ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషం అన్నారు.ఈ అవార్డు రావడానికి నాకు సహకరించిన సేవా భారతి , పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement