Wednesday, April 24, 2024

శ్రీచైతన్య యాడ్​ అంతా బూటకం, నటించిన బన్నీపై చర్యలు తీసుకోవాలే.. పోలీసులకు ఫిర్యాదు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల యాడ్ వివాదాస్పదమవుతోంది. కొత్త ఉపేందర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్​ చేశారు. బన్నీ నటించిన శ్రీ చైతన్య వ్యాపార ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ప్రకటిస్తూ.. శ్రీచైతన్యతో పాటు అల్లు అర్జున్‌పై ఉపేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, ఈ నెల 6వ తేదీన వివిధ వార్త పత్రికల్లో ఐఐటీ,, ( IIT ) ఎన్ ఐటి ( NIT ) ర్యాంకులపై ఇచ్చిన తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని ఉపేందర్ రెడ్డి పోలీసులను కోరారు. అందులో 10 లక్షల మంది ఇంజినీర్లు, 80 వేల మంది డాక్టర్లు తమ సంస్థ అందించినట్లుగా శ్రీచైతన్య ప్రకటించిందని.. అలా చేయడం అసాధ్యమని ఉపేందర్ రెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావడం లేదు. లీగర్ ఓపీనియన్ తీసుకుని ఈ ఫిర్యాదుపై ముందుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement