Friday, April 19, 2024

త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ .. 95% స్థానికులకే అవకాశం.. మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్ లో కానిస్టేబుల్..ఎస్ ఐ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పాలు, పండ్లు, ఎగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ..త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ యువత కు అగ్నిపత్ పేరుతో ఆర్మీ ఉద్యోగాలు రాకుండా చేసిందని ఫైర్‌ అయ్యారు. యువత జీవితాన్ని నాశనం చేసే విధంగా ఆర్మీలో అగ్నిపత్ పేరుతో కాంటాక్ట్ విధానం తెచ్చిందని మండిపడ్డారు. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తాం.. 95% స్థానికులకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement