హైదరాబాద్ – ఓ రాజకీయ నేత ప్రయాణం మరో 15 మంది ప్రయాణీకులకు శాపంగా మారింది..విమానాశ్రయానికి సకాలంలో వెళ్లకపోవడంతో ఈ 15 మంది విమానాన్ని మిస్ చేసుకున్నసంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.. ఈ విషయాన్ని బాధితుడు టాలీవుడ్ సింగర్ శ్రీరామ్ చంద్ర తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు..
హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి శ్రీరామ్ చంద్ర శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి కారులో బయలు దేరిన సమయంలో అటుగా ఓ రాజకీయనాయకుడు వెళ్తుండటంతో ఎయిర్ పోర్ట్కు వెళ్లే పివి నరసింహారావు ఫ్లై ఓవర్ను తాత్కాలికంగా మూసేసారు. దీంతో ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.. దాంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే అదే సమయంలో ఎయిర్ పోర్ట్కు వెళ్లే శ్రీరామ్ చంద్ర కూడా ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు.. ఫ్లై ఓవర్ కాకుండా వేరే దారిలో వెళ్లిన కూడా విమానాన్ని అందుకోలేక పోయాడు.. తనతో పాటు మొత్తం 15 మంది విమానాన్ని మిస్ అయ్యామని శ్రీరామ్ చంద్ర తెలిపాడు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్ను, సీఎం కేసీఆర్ను ట్యాగ్ చేశాడు శ్రీరామ్ చంద్ర. రాజకీయ నేతల ప్రయాణాల కోసం తమ లాంటి సామాన్యులను ఇబ్బందు పెట్టవద్దంటూ కెటిఆర్ ను వేడుకున్నాడు.