Saturday, April 20, 2024

Loknath Sharma: తెలంగాణ పథకాలు అద్భుతం: సిక్కిం మంత్రి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోకనాథ్ శర్మ అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన కార్యాలయంలో సిక్కిం మంత్రి మర్యాదపూర్వకంగా కలిసారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి తలసాని వివరించారు.

ఈ సందర్భంగా సిక్కిం మంత్రి మాట్లాడుతూ.. పాడి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్భుతమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలో కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సిక్కిం రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్ధికంగా ఎంతో అభివృద్దిని సాధిస్తుందన్నారు. కృత్రిమ గర్భధారణ కార్యక్రమం వలన మేలుజాతి పశుసంపద ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఇది పాడి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సిక్కిం మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement