Friday, March 29, 2024

Siddipet – దేశానికే తెలంగాణ మార్గ‌ద‌ర్శి – హ‌రీష్ రావు

సిద్దిపేట – పధ్నాలుగేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో నేడు తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా నిలిచింద‌ని మంత్రి హారీష్ రావు అన్నారు…. తెలంగాణ దశబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం అంటూ తొమ్మిది సంవత్సరాల ప్రగతి యాత్రను పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ఇది మనమంతా గర్వపడాల్సిన సందర్భమని వ్యాఖ్యానించారు.

మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశా, దిశా నిర్దేశించేలా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తున్నదని.. సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు… ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో తొమ్మిదేళ్ల‌లోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి.

Advertisement

తాజా వార్తలు

Advertisement