Monday, March 25, 2024

Medak | యాక్సిడెంట్​లో తీవ్ర గాయాలు.. చికిత్సపొందుతూ ఒకరి మృతి

చౌటకూర్​, (ప్రభన్యూస్): బైక్​ అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ఇవ్వాల (శనివారం) చనిపోయాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పుల్కల్​ ఎస్​ఐ విజయ్​ కుమార్​ గౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణం హనుమాన్ నగర్​ కు చెందిన మంగలి యాదగిరి (28), చౌటకూర్​ మండలం తాడ్దాన్​పల్లి శివారులో రాయల్​కింగ్ దాబా ఉంది.

శివంపేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డుపై వడ్లు ఆరబోశారు. కాగా ఈ నెల 25వ తేదీన సంగారెడ్డి నుంచి దాబా వైపు బైకుపై వెళ్తున్న క్రమంలో వడ్ల కుప్పలను తప్పించబోయి యాదగిరి బైక్​ అదుపు తప్పింది. దీంతో తీవ్రమైన గాయాలయ్యాయి. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం చనిపోయాడు. ఈ మేరకు మృతుని సోదరుడు శివకుమార్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement