Thursday, April 25, 2024

కరోనాతో మరో జర్నలిస్టు మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి, తెలుగు జర్నలిస్టుని బలి తీసుకుంది. ఆర్‌కెగా సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ  ఈరోజు ఉదయం కన్నుమూశారు. కరనా సోకడంతో సోమవారం గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అయితే, చికిత్స పొందుతూ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఎన్‌టీవీలతోపాటు డెక్కన్‌ క్రానికల్‌ లో ఆయన పనిచేశారు. దీంతో మీడియా వర్గాల్లో విషాదచాయలు నెలకొన్నాయి. జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ  మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

 కాగా, కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు మృతిచెందగా మరో జర్నలిస్టు మృతితో మీడియా వర్గాల్లో కలకలం రేపుతోంది. కరోనా మహామ్మారిని ఎదుర్కోనేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కొనసాగుతున్న వారిలో మరణాలు ఆందోళన కల్గిస్తున్న అంశంగా మారాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement