Tuesday, March 26, 2024

140 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం ప‌ట్టివేత‌.. మ‌హారాష్ట్రకు త‌ర‌లిస్తున్న‌ డీసీఎం స్వాధీనం

భూపాలపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం మెరుపు దాడులు చేసింది. పరకాల నుండి మహారాష్ట్రకు 140 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంతో వెళ్తున్న (టీఎస్ 24టి 7358) డీసీఎం వాహనాన్ని స్పెషల్ టీమ్ ఓఎస్డీ ప్రభాకర్ , ఎస్ ఓ లక్ష్మారెడ్డి , ఎస్సై జంగయ్య భూపాలపల్లి శివారులో జాతీయ రహదారి పై పట్టుకున్నారు.

టాస్క్ ఫోర్స్ ఎస్ ఓ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిడిఎఫ్ లోడుతో మహారాష్ట్రకు వెళుతున్న వాహనం ఆపెందుకు ప్రయత్నించగా డ్రైవర్ చాలా రాష్ డ్రైవింగ్ తో వెళ్తుండటంతో చేజింగ్ చేసి పట్టుకున్నామని తెలిపారు. 140 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంతోపాటు డీసీఎం వాహనాన్ని స్థానిక భూపాలపల్లి స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement