Friday, April 19, 2024

ఏప్రిల్ 30న జ‌ర‌గాల్సిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నిక‌లు ర‌ద్దు..

సికింద్రాబాద్ – ఏప్రిల్ 30వ తేదిన జ‌ర‌గాల్సిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక‌ల‌ను రద్దు చేశారు.. ఈ మేర‌కు ర‌క్ష‌ణ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..అలాగే కేంద్ర ర‌క్ష‌ణ శాఖ నిర్ణ‌యంతో దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ల‌లో ఎన్నిక‌లు ర‌ద్దు అయ్యాయి.. కాగా,2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలక‌వర్గం కొనసాగింది..అనంత‌రం . కేంద్రం నామినేటెడ్‌ సభ్యుడిని నియమించింది. ఆయ‌న సూచ‌న‌ల‌తో కంటోన్మెంట్ ప‌రిపాల‌న కొన‌సాగుతుంది.. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 30వ తేదిన ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కంటోన్మెంట్ బోర్డు ఎన్నిక‌ల షెడ్యూల్ ను విడుద‌ల చేసింది.. తాజా ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేసింది ర‌క్ష‌ణ శాఖ‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement