Thursday, April 25, 2024

బీఆర్ఎస్ పార్టీలో చేరిన.. 40కి పైగా గ్రామాల సర్పంచ్ లు

భారత్ పేదదేశం ఎంతమాత్రం కాదన్నారు సీఎం కేసీఆర్.శివాజీ, అంబేద్కర్,పూలే విగ్రహాలకు కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికాకంటే శక్తివంతంగా ఎదుగుతుందన్నారు.నాందేడ్ లో బిఆర్ ఎస్ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొన్ని ప్రసంగించారు. కాగా ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీలో పలువురు నేతలు చేరారు. భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో నాందేడ్ వాసులు భారీ సంఖ్య‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. నాందేడ్‌ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 40 గ్రామాలకు పైగా సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement