Friday, March 29, 2024

దశాబ్దాల నిరీక్షణకు మోక్షం.. ఆర్ఓబీ కోసం 119.50 కోట్లు రిలీజ్

దశాబ్దాల నిరీక్షణకు త్వరలో మోక్షం లభించనుంది. పెద్దపల్లి నుండి కూనారం వెళ్లే దారిలో ఉన్న రైల్వే గేట్ వద్ద నిత్యం పడిగాపులు కాసే వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఆర్ ఓ బి నిర్మాణానికి 119.50కోట్ల రూపాయలు ఫండ్స్ విడుదలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు రోజు రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలుమార్లు తెలంగాణ సీెం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దానికి స్పందించిన ముఖ్యమంత్రి అర్ ఓ బి నిర్మాణానికి నిధులు విడుదల చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో ఎందరో పాలకులు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం హామీలు ఇచ్చినా అది నెరవేరలేదు. నిధుల మంజూరుతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం మంజూరైన 119.50 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 67.93 కోట్ల రూపాయలు విడుదల చేయగా రైల్వే శాఖ 51.57 కోట్ల మంజూరు చేసింది. దశాబ్దాల కల నెరవేర్చినందుకు పెద్దపెల్లి జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement