Tuesday, April 23, 2024

సాలు మోడీ.. సంపకు మోడీ… మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి)… గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని… సాలు మోడీ.. సంప‌కు మోడీ అంటూ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందనం చెరువు పరిసర ప్రాంతం నుండి మీర్పేట చౌరస్తా వరకు గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ భారీ ధర్నా నిర్వహించారు. మహిళా సోదరీమణులతో భారీ పాదయాత్రతో నిర్వహించి, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తలపైన కట్టెల మోపును ధరించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, బడంగ్పేట్, ఆర్కేపురం, సరూర్నగర్, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, జలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement