Friday, March 29, 2024

దిశ నిందితుల ఎన్ కౌంటర్: విచారణకు మాజీ సీపీ సజ్జనార్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిటీ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి నాటి సైబరాబాద్ సిపి సజ్జనార్ ను కూడా త్రిసభ్య కమిటీ విచారించనుంది. ఇందుకోసం సజ్జనార్ కు ఇప్పటికే సమన్లు కూడా జారీ అయ్యాయి. విచారణ రేపు లేదా ఎల్లుండి జరిగే అవకాశం ఉంది.

మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సమర్పించిన నివేదికపై నేడు త్రిసభ్య కమిటీ విచారణ జరపనుంది. ఈ విచారణకు మానవ హక్కుల సంఘంలోని ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు కమిటీ ముందు హాజరు కానున్నారు. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిటీ విచారణ తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా సజ్జనార్ ను కూడా త్రిసభ్య కమిటీ విచారించనుంది. దీనికి గాను సజ్జనార్ కు ఇప్పటికే సమన్లు కూడా జారీ అయ్యాయి. విచారణ రేపు లేదా ఎల్లుండి జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement