Tuesday, April 16, 2024

రోడ్డు ప్ర‌మాదం : క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించిన మంత్రి స‌బితా

వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఓ గుర్తు తెలియ‌ని షిఫ్ట్ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే తన కాన్వాయ్ ని ఆపి ప్ర‌మాదంలో గాయపడిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని.. వారికి చికిత్స నిమిత్తం త‌న కాన్వాయ్ లోని పోలీస్ వాహ‌నంలో క్ష‌త‌గాత్రుల‌ను వికారాబాద్ ఆస్పత్రికి త‌ర‌లించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement