Wednesday, April 24, 2024

మెద‌క్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. దంప‌తులు మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మమహ్మద్‌నగర్‌ గేట్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్లకు చెందిన దంపతులు ఏడుపాయల దర్శనానికి వెళ్లి తిరుగు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆటో లారీని ఓవర్‌ టెక్‌ చేస్తున్న సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్ర‌మాద‌ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement