భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంతకుముందే (మంగళవారం రాత్రి) యాక్సిడెంట్ జరిగింది. అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం వద్ద ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో 10 నెలల పసిపాప కూడా ఉంది. కాగా, లారీ ఢీకొన్న ధాటికి టాటా ఏస్ కేబిన్ లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీయడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఎటువంటి వివరాలు అందలేదు.
ఈ వీడియో కోసం www.prabhanews.com ని క్లిక్ చేసి వీడియో ట్యాబ్లో చూడొచ్చు