Wednesday, April 24, 2024

చిన‌జీయ‌ర్ స్వామి పై రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం

సమక్కసారలమ్మ లపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగుతోంది. ప‌లువురు నేత‌లు ఈ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ….‘‘తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించాలి. మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement