Wednesday, April 24, 2024

రేవంత్ రెడ్డి భద్రతపై హైకోర్టులో విచారణ వాయిదా

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రభుత్వం తగిన విధంగా భద్రత కల్పిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. రేవంత్ పాదయాత్రకు గట్టి బందోబస్తు కల్పించాలని డిజి ఇప్పటికే ఎస్పీలకు లేఖ పంపారని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement