Wednesday, April 24, 2024

వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించిన రేవంత్ రెడ్డి..

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి మండలంలోని సుంకిని గ్రామంలో వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలు పరిశీలించారు. కోటగిరి మండలంలోని రైతులు తమ గోడును ఆయన ముందు వెళ్లబోస్తున్నారు. గత రెండేళ్లుగా వేసవిలో వేసిన పంటలు ప్రకృతి కన్నెర్ర చేయడంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు తమ ఆవేదంలో కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంత‌రం రేవంత్ మీడియ‌తో మాట్లాడుతూ, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాసుల బాలరాజు, పుప్పాల శంకర్, గంధపు పవన్ కుమార్, హనుమంతరావు, రాజు, పార్టీ నాయకులు వహీద్ తదితరులు రేవంత్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement