Saturday, April 20, 2024

తిరుమలకు టీ.పీసీసీ చీఫ్.. అభిమానులకు రేవంత్ కీలక సూచన

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం(నవంబర్ 8) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం ఓ ప్రకటన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని తెలిపారు. అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు, పూలదండలకు పెట్టే ఖర్చును అనాథలకు, పేదవారికి సహాయం చేయాలని అభిమాలనుకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అభిమానులు తనను వ్యక్తిగతంగా కలిసి చెప్పే శుభాకాంక్షల కన్నా ఈ పని తనకు ఎంతో సంతృప్తి ఇస్తుందని రేవంత్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement