Saturday, April 20, 2024

క్రిస్మ‌స్, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించాలి : రాజాసింగ్

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న విష‌యం తెలిసిందే.. అయితే క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. ఒమిక్రాన్‌ విజృంభించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు క్రిస్మస్‌, న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో గణేష్‌ నిమజ్జనం, హనుమాన్‌ ర్యాలీలు నిర్వహించకుండా ప్రభుత్వానికి సహకరించామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ గుర్తుచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement