Wednesday, April 24, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ట్రియంప్ విల్లాస్ కాలనీ వాసులు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని రాజేంద్రనగర్ కిస్మతుపురాలోని త్రియంప్ విల్లాస్ కాలనీవాసులు తమ కాలనీ సమావేశం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 25 పారిజాత మొక్కలను నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా అద్భుతమైన కార్యక్రమం తీసుకొని ప్రజల్లో పర్యావరణం పట్ల చైతన్యం నింపడం జరుగుతుందని కొనియాడారు. తమకు పారిజాత మొక్కలు పంపిన అరుణా ఫోటో స్టూడియో యాజమాని నిమ్మల సతీష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్ రావు, పద్మావతి, సునీతా రెడ్డి, బీనా, వనజా, అనితా, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement