Saturday, April 20, 2024

పట్టభద్రుల బాటలోనే స్థానిక సంస్థల ప్రతినిధులు : స‌బితా ఇంద్రారెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ వెంట నడిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రతిపక్షాలు ఏకమైనా కూడా గ్రేట్ విక్టరీ అందించిన ప్రజాప్రతినిధులకు ఉద్యమాభివందానాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా, ఎన్నికల ద్వారా గెలుపొందిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌న్నారు.

వందశాతం అనుకూల ఫలితాలు.. తెలంగాణ బంగారు బాటకు సోఫానాలు అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, గ్రాడ్యుయేట్లు, యువత, మహిళలు, ఉపాధ్యాయ ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ప్రయివేటు రంగ ఉద్యోగులు అందిస్తున్న విజయాలతో మరింత బాధ్యతగా, రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడతామ‌ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement