Thursday, April 25, 2024

పీజీ వైద్య కోర్సుల‌నోటిఫికేషన్స్ విడుదల..

ప్రభ‌న్యూస్ : పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లమా/డిగ్రీ సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 20 ఉదయం 8 గంటల నుంచి నవంబరు 27 సాయంత్రం 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబందిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం… తుది మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement