బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో, తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడదలైంది. ఈనెల 8 నుంచి కౌన్సెలింగ్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎడ్ఎట్ కన్వీనర్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్కు హాజరై సర్టిఫికెట్లను ఆప్లోడ్ చేయని విద్యార్థులు వెంటనే స్కాన్ చేసిన కాపీలను సమర్పించాలని, ఆ తర్వాతే రెండో విడత కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మొదటి విడత కౌన్సెలింగ్లో సర్టిఫికెట్లను సమర్పించిన విద్యార్థులు నేరుగా వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital