Thursday, March 28, 2024

ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా మీర్జా ర‌హ‌మ‌త్ బేగ్…

హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎంఐఎం పార్టీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఎంఐఎం త‌ర‌పున మీర్జా ర‌హ‌మ‌త్ బేగ్‌ను బ‌రిలో దింపుతున్న‌ట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా త‌న ప‌ద‌వీ కాలం పూర్తి చేసుకున్నసయ్యద్‌ హసన్‌ జాఫ్రీ కు ఓవైసీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భ‌విష్య‌త్‌లో కూడా స‌యీద్ అమీన్ సేవ‌ల‌ను పార్టీ ఉప‌యోగించుకుంటుంద‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు అస‌ద్ వ‌రుస‌గా ట్విట్లు చేశారు.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ర‌హ‌మ‌త్ బేగ్ గ‌తంలో రాజేంద్ర న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ప్రస్తుతం గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా కూడా ర‌హ‌మ‌త్ కొన‌సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement