భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లోని నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు . మంగళవారం నాడు జిల్లాలోని పలు శాఖల అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 12న భద్రాది జిల్లాకి రానున్నారని.. పర్యటన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సమీకృత కలెక్టరేట్లు ఉన్నట్లు దేశంలో.. ఏ రాష్ట్రంలో లేవన్నారు.. సుమారు 32 శాఖల అధికారులు ఒకే కార్యాలయంలో పరిపాలన ప్రారంభించడం వల్ల .. ప్రజలకు సేవలు సులభతరం కానున్నాయన్నారు.. అన్ని సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ కార్యాలయం వేదికగా మారతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండి గల రాజేందర్ , జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ , జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ , జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్ల , పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.