Saturday, April 20, 2024

Warangal: ఏనుమాముల మార్కెట్ లో మిర్చి రైతుల ఆందోళన

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. తేజ మిర్చికి  రూ.17 వేల రెండు వందల బీట్ పలికి.. రూ.14 వేలు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిర్చి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement