Wednesday, April 24, 2024

రేషన్ బియ్యం పట్టివేత

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీని జగద్గిరిగుట్ట పోలీసులు ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో బియ్యాన్ని తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి వారి ఆదేశాలతో ఆ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరో కేసులో ..
గాజులరామారం రావి నారాయణ రెడ్డి నగర్ లో ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు దాడి చేసి 15 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా ఆల్విన్ కాలనీలో ఆటోలో తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు సదరు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement