Tuesday, March 26, 2024

కరీంనగర్ కమిషనరేట్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. కమిషనరేట్ కార్యాలయంలో ముందస్తుగా అడిషనల్ డిసిపి అడ్మిన్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చిజెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ హకీంపేట్ కు చెందిన 70 మంది రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వారం రోజులపాటు కవాతు చేపడతారని చంద్ర మోహన్ తెలిపారు. నగర ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేత కవాతును చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే నగరంలో రౌడీషీటర్లు క్రమశిక్షణను మార్చుకోవాలని కోరారు. కరీంనగర్ రూరల్ అర్బన్ హుజురాబాద్ డివిజన్లలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిచే అవార్డులు చేపట్టే ప్రజలలో భయాందోళనలు తీసి వేస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement