Thursday, April 25, 2024

కత్తిపోట్లకు గురైన యువతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్..

కర్మన్ ఘాట్ ,(ప్రభ న్యూస్) : తొమ్మిది రోజుల క్రితం కత్తిపోట్లకు గురైన యువతి పూర్తిగా కోలుకొవటంతో డిశ్చార్జ్ చేసినట్లు హస్తినాపురం చౌరస్తాలోని నవీన ఆస్పత్రి డాక్టర్ రవి తేజ తెలిపారు. గురువారం ఆసుపత్రిలో ఆర్ ఎం వో రణ్ ధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో చికిత్స చేసిన వైద్యులు మాట్లాడుతూ ఆస్పత్రిలో చేరిన సమయంలో సుమారు 18 కత్తిపోట్లుతో తీవ్ర రక్తస్రావంతో సీరియస్ గా ఉన్నదని వైద్యం అందించడంతో రాను రాను వైద్యుల పర్యవేక్షణలో తగ్గుముఖం పట్టిందని పూర్తిగా కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఔ

ఇంత త్వరగా యువతి కోలుకోవడానికి సహకరించిన వైద్య బృందం ఇతర సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు. శిరీష తల్లి నర్సమ్మ మాట్లాడుతూ తన కూతురుని కొలుకోవటానికి డాక్టర్లు బాగా కృషి చేశారని మంచి వైద్యం అందించి తన బిడ్డను కాపాడారని త‌న కూతురుని కాపాడిన వైద్యులకు రుణపడి ఉంటా అని ఆమె పేర్కొన్నారు. తాము కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తామని ఆమె తెలిపారు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని ఆమె కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement