Thursday, March 28, 2024

యాసంగిలో ప్రతి గింజ కొనుగోలు చేస్తాం : మంత్రి సబితారెడ్డి

యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, గన్ని బ్యాగ్ లు, రవాణా తదితర వాటిపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో వెనకడుగు వేయడంతో రాష్ట్రమే కొనుగోలు చేస్తోందన్నారు. సమీక్షలో కలెక్టర్ అమోయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, డీసీసీబీ, డీసీఎంఎస్ ల ఛైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement