Wednesday, April 17, 2024

నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

నీటిసంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాధ ఘటన రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లిలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. నీటి సంపుకు ఉన్న మూత తెరిచి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. చివరికి నీటి సంపులో మృతదేహం లభించింది. చిన్నారి మృతి చెందడంతో ఆతల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement