Friday, April 19, 2024

నో రూల్స్.. శంకర్ పల్లి మార్కెట్లో జనమే జనం..

శంకరపల్లి : పండుగ ముందు ఆదివారం అంగట్లో జన సందోహంతో శంకర్పల్లి కిక్కిరిసిపోయింది. శంకర్పల్లి కూరగాయల మార్కెట్లో గుంపులు గుంపులుగా కూరగాయల వినియోగదారులు స్థానిక కూరగాయల వ్యాపారులు పండించిన పంటలను కొనడానికి వచ్చిన రైతులు పండుగ కారణంగా భారీగా రద్దీ ఏర్పడింది, సామాజిక దూరాలు లేవు కొందరికి మాత్రమే మాస్కులు ఉన్నాయి మాస్కులు లేని వారిని అడిగే వారే లేరు, ఆదివారం రోజు మార్కెట్ ఉంటుందనే విషయం తెలిసి కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడేందుకు మనందరం మాస్కులు ఉపయోగించాలని తెలియపరచే పరిస్థితులు ఇక్కడ ఎక్కడా కనబడటం లేదు. ఇలా అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెంద కపోతే మరి ఏమవుతుందో అర్థంకాని పరిస్థితి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఎక్కడున్నారో, అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement